ఆర్ భాగయ్యకు దళిత రత్న అవార్డు
NEWS Jun 14,2026 12:41 pm
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏబీసీడీ వర్గీకరణ సాధనలో కృషి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న రవీంద్రభారతిలో "దళిత రత్న" అవార్డులతో సత్కరించింది. కంటి ఆపరేషన్ కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన భాగయ్య, జూన్ 13న హైదరాబాద్ రాంనగర్లోని జాతీయ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ దక్షిణాది చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ఎన్. రమేష్ కుమార్ చేతుల మీదుగా దళిత రత్న అవార్డును అందుకున్నారు.