రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుసుమ రామయ్య జెడ్పీ పాఠశాలలో తరగతి గదిని చీపురుతో శుభ్రం చేస్తుండగా, ఒక బెంచి అకస్మాత్తుగా ఆయనపై పడింది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు, సిబ్బంది ఆ బెంచ్ను పక్కకు తొలగించడంతో మంత్రికి తృటిలో ప్రమాదం తప్పింది.