దుబాయ్ జైల్లో జగిత్యాల యువకుడు
NEWS Jun 12,2026 11:57 pm
పశ్చిమాసియా దాడులను ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసిన భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిలో జగిత్యాల జిల్లా గుల్లపేటకు చెందిన గోపు భూమేశ్ (26)పై దేశద్రోహం కింద అరెస్టు చేశారు. అక్కడి జైల్లోనే ఉన్నాడు. తీవ్ర ఆందోళనకు గురవుతున్న కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి భూమేశ్ను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.