మిసెస్ కేరళ రన్నరప్ అరెస్ట్
NEWS Jun 12,2026 11:40 pm
గత ఏడాది ‘మిసెస్ కేరళ’ రన్నరప్గా నిలిచిన మోడల్ హర్ష సన్నీ (28)ని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో లగేజీని తనిఖీ చేయగా 11 కిలోలకు పైగా హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.11.82 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి ఆమెను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.