కవిత పార్టీలోకి గైని శ్రీనివాస్ గౌడ్
NEWS Jun 12,2026 11:31 pm
KMR: కామారెడ్డికి చెందిన సీనియర్ నాయకుడు, పంచముఖి హనుమాన్ ఆలయ మాజీ ఛైర్మన్ గైని శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రక్షణ సేనలో చేరారు. TRS జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో చేరిన ఆయనకు ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కామారెడ్డి నియోజకవర్గంలో కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు. జిల్లాలో జెండా గద్దెలు నిర్మించి, జెండావిష్కరణ చేయాలని ఆదేశించారు