మోదీతో సీఎం రేవంత్ కీలక భేటీ
NEWS Jun 11,2026 11:45 pm
ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్ర సహకారం కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం ఇవ్వాలని, 122.9 కి.మీ విస్తరణ ప్రతిపాదనలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించాలని కోరారు. హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్వేకు అనుమతి ఇవ్వాలని, గోదావరి జలాల వినియోగానికి మహారాష్ట్రతో చర్చల్లో కేంద్రం సహకరించాలని అభ్యర్థించారు. అలాగే వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.