సమస్యల పరిష్కారానికి సీపీఐ వినతి
NEWS Jun 10,2026 02:27 pm
పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ పార్టీ డివిజన్ ఇన్చార్జి కాకాటి దుర్గ భవాని డిప్యూటీ మేయర్, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రం అందజేశారు. డివిజన్లో పెండింగ్లో ఉన్న డ్రైనేజీ పనులు, దమ్మపేట సెంటర్ డౌన్ నుంచి ములకలపల్లి వరకు రహదారి మరమ్మత్తులు, మున్సిపల్ మంచినీటి ట్యాపుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా దుర్గ భవాని మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున అధికారులు స్పందించి డివిజన్లోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.