ఉదృతంగా బడిబాట కార్యక్రమం
NEWS Jun 09,2026 07:55 pm
కోరుట్ల: SRSP క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు తెలిపారు. ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే 56 మంది కొత్త విద్యార్థులు చేరినట్లు చెప్పారు. ఉపాధ్యాయులు అబ్దుల్ రవూఫ్, యస్ పూర్ణచందర్, ధనలక్ష్మి, సుమలత, భవాని, అంగన్వాడీ టీచర్స్ హిమగిరి, ప్రసన్న లక్ష్మి,మాధవి, శోభా రాణి పాల్గొన్నారు.