గెస్ట్ లెక్చరర్ పోస్ట్.. దరఖాస్తులు ఆహ్వానం
NEWS Jun 09,2026 07:32 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 గాను ఇంటర్మీడియట్ నర్సింగ్ సబ్జెక్టు బోధించుటకు గెస్ట్ లెక్చరర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ ఎర్ర రజిత తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై బోధన అనుభవం గల మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు l తెలిపారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 12 సా.4:30 నిమిషాల లోపు తమ దరఖాస్తులను మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో దరఖాస్తులను నేరుగా సమర్పించవలసి ఉంటుందని తెలిపారు.