గుడ్ల నుంచి 50 మొసలి పిల్లలు!
NEWS Jun 09,2026 01:07 pm
సంగారెడ్డి D సదాశివపేట M మిల్గిరిపేట చెరువు సమీపంలో ఓ రైతు పొలంలో సుమారు 50 మొసలి గుడ్లు కనిపించాయి. వాటిలో కొన్ని గుడ్ల నుంచి మొసలి పిల్లలు బయటకు రావడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏటా ఫిబ్రవరి-మార్చిలో మొసళ్లు గుడ్లు పెట్టగా, జూన్–జులైలో పిల్లలు బయటకు వస్తాయని స్థానికులు తెలిపారు.