భారత్ వద్ద 190 అణ్వాయుధాలు
NEWS Jun 08,2026 01:55 pm
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల నేపథ్యంలో అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయని సిప్రి చెప్పింది. తాజాగా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్ వద్ద 190 అణు వార్హెడ్లు ఉండగా, పాకిస్థాన్ కంటే 20 ఎక్కువగా ఉన్నాయి. ఏడాదిలో భారత్ 10 అణ్వాయుధాలను పెంచుకుంది. చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉండగా, రష్యా (5,420), అమెరికా (5,042) తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలోని 9 అణుశక్తి దేశాల వద్ద మొత్తం 12 వేలకుపైగా అణ్వాయుధాలు ఉన్నట్లు సిప్రి నివేదిక పేర్కొంది.