టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
NEWS Jun 07,2026 12:29 am
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ తమ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పారిశ్రామికవేత్త సానా సతీష్, ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, పార్టీ సోషల్ మీడియా విభాగం ముఖ్య నేత చింతకాయల విజయ్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో వారికి బి-ఫారాలు అందజేశారు. వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, ఏపీలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ తరఫున లింగమనేని రమేష్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.