నిరుద్యోగ యువతతో జూపెళ్లి దుర్గాప్రసాద్ భేటీ
NEWS Jun 07,2026 12:16 am
పాల్వంచ పట్టణంలోని లైబ్రరీని బీఆర్ఎస్వీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు జూపెళ్లి దుర్గాప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ఆయన మాట్లాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. నాణ్యమైన కోర్సులు, స్టడీ మెటీరియల్, అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వం పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉండటం అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగ లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.