ఘనంగా 'గోపా' సన్నాహక సమావేశం
NEWS Jun 05,2026 06:29 pm
మహబూబ్నగర్: గోపా సన్నాహక సమావేశం ఘ నంగా జరిగింది. మాజీ జిల్లా అధ్యక్షుడు బాగన్న గౌడ్, PRTU జిల్లా గౌరవాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యల్మకంటి మీరయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ చరిత్ర, సేవా కార్యక్రమాలు, యువత, విద్యా, ఉద్యోగ అవకాశాలపై వివరించారు. జిల్లా కమిటీని త్వరలో ఏర్పాటు చేసి, గోపా కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు విస్తరించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.