కొమిరెడ్డి సేవలు స్మరించుకున్న మంత్రి
NEWS Jun 03,2026 05:25 pm
మెట్ పల్లిలో కోమిరెడ్డి రాములు జయంతి వేడుకలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాములు చిత్ర పటానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దివంగత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా కోరుట్ల, మెట్ పల్లి ప్రాంత ప్రజలకు రాములు అందించిన సేవలు మరువలేని అని అన్నారు.