ఎల్లమ్మ ఆలయానికి రూ.99,130 ఆదాయం
NEWS Jun 03,2026 12:07 am
మెట్పల్లి: వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయానికి మంగళవారం మొత్తం రూ.99,130 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. వివిధ సేవా టికెట్ల విక్రయాల ద్వారా రూ.82,150 ఆదాయం సమకూరగా, హుండీ కానుకల రూపంలో రూ.16,980 లభించినట్లు వెల్లడించారు. ఆలయ ఆదాయ లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ డివిజన్ పరిశీలకులు రాజా మొగిలి, ఎండోమెంట్ సిబ్బంది కల్వకుంట్ల అనిల్రావు, కూకట్ల రాజేందర్, గుంటుక శివకేశవ్, మ్యాత లహరి తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి భక్తులు విశేషంగా తరలి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.