కోరుట్ల పట్టణంలో పట్టపగలు జరిగిన సెల్ఫోన్ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉ. 11 గంటలకు ఓ వ్యక్తి దుకాణంలోకి వచ్చి అక్కడి సెల్ఫోన్ను అపహరించి పరారయ్యాడు. అతడి కదలికలు మొత్తం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. చోరీకి గురైన ఫోన్కు సంబంధించిన వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ను బాధితుడు పోలీసులకు అందజేశాడు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే కోరుట్ల ఎస్ఐ చిరంజీవికి లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. దొంగతనాలను నిర్లక్ష్యం చేస్తే అవే భవిష్యత్తులో పెద్ద నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.