తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే.. పదవుల్లో ఉన్నారని.. ఎమ్మెల్యేలు అయ్యారని పవన్ కల్యాణ్ వివరించారు. తెలంగాణకు ద్రోహం జరిగితే ముందు గొంతులేపేది జనసేన పార్టీనే అని, ఏం చేసినా ఓట్ల కోసం కాదు.. తనకు తెలంగాణపై ప్రేమ, మమకారం ఉన్నాయన్నారు.