జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
NEWS Jun 02,2026 02:11 pm
ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట పటిమను వారసత్వంగా పొందిందని, అణగారిన వర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛ కోసం గళం వినిపించే ధైర్యం తెలంగాణ సమాజంలో ఉందని, అదే స్ఫూర్తి జనసేన శ్రేణుల్లోనూ నిండి ఉందన్నారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన అమరవీరులకు అంజలి ఘటించిన ఆయన, రాష్ట్రం అన్ని రంగాల్లో సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.