Logo
Download our app
గుండు చేయించుకుంటే గుర్తించని యాప్
NEWS   May 29,2026 01:43 pm
ఉపాధి హామీ పథకంలో హాజరు నమోదుకు కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు బయటపడుతున్నాయి. ఓ కూలీ గుండు చేయించుకుని ఉపాధి పనులకు వెళ్లగా.. మొబైల్ సాఫ్ట్‌వేర్ అతడి ముఖాన్ని గుర్తించలేదు. ఎంతసేపటికీ ఫేస్ రికగ్నిషన్ కాకపోవడంతో.. చివరకు పక్కనే ఉన్న మహిళ జుట్టును తలపై కప్పి ఫొటో దిగిడంతో యాప్ అటెండెన్స్‌ను అంగీకరించింది. మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లి (ఇనుగుర్తి)కి చెందిన మల్యాల శ్రీను కొండగట్టు అంజన్నని దర్శించుకుని తలనీలాలు సమర్పించాడు. గురువారం ఉపాధి పనులకు వెళ్లగా.. హాజరు సమయంలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ అతని ముఖాన్ని గుర్తించలేదు. పలుమార్లు ప్రయత్నించినా హాజరు నమోదు కాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో నల్లటి బొగ్గుతో గడ్డం, మీసాలు దిద్దుకుని.. తలపై వెంట్రుకలు ఉన్నట్లు ఓ మహిళ జుట్టును పెట్టుకోగా.. యాప్ గుర్తించింది.

Top News


LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...
LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...
LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...
LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...
LATEST NEWS   Jun 07,2026 11:36 pm
కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...
LATEST NEWS   Jun 07,2026 11:36 pm
కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...
⚠️ You are not allowed to copy content or view source