జర్నలిస్టుని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
NEWS May 29,2026 11:44 am
కామారెడ్డి జిల్లా సాక్షి దినపత్రిక స్టాఫర్ వేణు మాతృమూర్తి సెపూరి లక్ష్మి నర్సవ్వ మరణించిన విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి వేణు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మృతురాలికి నివాళులర్పించారు.