తీవ్ర ఇబ్బందుల్లో మొక్కజొన్న రైతులు
NEWS May 23,2026 05:37 pm
సదాశివనగర్ మండలంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు సమస్యలతో సగం పంట ఎండిపోగా, మిగిలిన పంటకు సరైన ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో దళారులు క్వింటాల్కు రూ.1900కే కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలాలి సాయిగౌడ్ ఆరోపించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.