పొక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం
NEWS May 23,2026 11:07 pm
మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామంలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో పాల్గొంటున్న మహిళలకు మహిళా, బాలికల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్ల లోపు బాలికలపై ఫోటోలు, వెకిలి చేష్టలు లేదా లైంగిక వేధింపులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణ హెచ్చరించారు. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు, పెద్దలు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.