తెలంగాణలో భానుడి భగభగలు
వడదెబ్బతో 22 మంది మృతి
NEWS May 22,2026 11:30 am
తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మధ్యాహ్న సమయంలో ఆరుబయటకు రావడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి. రాష్ట్రంలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వడదెబ్బల కారణంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 22 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.