రోడ్ల ఆక్రమణలపై పోలీసుల కఠిన చర్యలు
NEWS May 22,2026 11:06 am
మంత్రాలయంలో రోడ్ల ఆక్రమణలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే రాజీ ఉండదని ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. గురువారం ప్రధాన రహదారిపై తనిఖీలు నిర్వహించిన పోలీసులు రోడ్డుపై వ్యాపారం చేస్తున్న సోడా, పండ్ల బండ్ల నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. రద్దీ రోజుల్లో ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని సోడా బండ్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.