ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ పర్యటనలో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మధ్య ఆసక్తికరమైన జర్నీ సాగింది. మోదీ, మెలోనీ కలిసి కార్ రైడ్కు వెళ్లడం, డిన్నర్, సెల్ఫీలు ఆకట్టుకున్నాయి. వీరిద్దరి పేర్లను కలిపి #Melodi (మెలోడీ) మూమెంట్ మళ్లీ ట్రెండింగ్గా మారింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలతో పాటు, నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహ బంధాన్ని ఈ రోమ్ పర్యటన చాటి చెప్పింది.