₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
NEWS May 20,2026 12:05 pm
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. IMEI ట్రాకింగ్ ద్వారా APతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నామని, ఇప్పటికే 4,785 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు చెప్పారు. మొబైల్ పోయిన వెంటనే CEIR పోర్టల్లో ఫిర్యాదు చేయాలని, CEIR వివరాల కోసం 9490617873 వాట్సాప్ నంబర్కు “hi” మెసేజ్ పంపాలని పోలీసులు తెలిపారు.