పరిష్కారం లేకపోతే న్యాయపోరాటం
NEWS May 13,2026 09:34 am
నందవరం మండలం నడికైరవాడి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ మాన్య భూమి సమస్యపై మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. దేవాలయానికి చెందిన 23.89 ఎకరాల ఇనాం భూమిని అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. వెంటనే దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడిన బుట్టా రేణుక, వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. లేకపోతే గ్రామ ప్రజలతో కలిసి న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. “దేవుడి మాన్యం దేవుడికే దక్కాలి” అంటూ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.