మండుటెండల్లోనూ నిండుగా బావులు
NEWS May 11,2026 01:49 pm
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన ఈ బావుల్లో ఇప్పటికీ కేవలం 10 అడుగుల లోతులోనే నీరు లభిస్తోంది. వర్షాకాలంలో అయితే నీరు ఉప్పొంగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక్కసారికూడా ఈ బావులు ఎండిపోలేదని వెల్లడించారు. భూగర్భ జలాల పరిశోధకుడు బైరెడ్డి వెంకటరంగారెడ్డి ప్రకారం, ఎగువ ప్రాంతాల్లోని చెరువుల నుంచి భూపొరల ద్వారా నీరు ఫిల్టర్ అయి ఈ బావుల్లోకి చేరుతుండటంతో ఎడాది పొడవునా నీరు నిల్వ ఉంటోందని తెలిపారు.