దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
NEWS May 10,2026 11:29 pm
సికింద్రాబాద్ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోవాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించాలని, రైతులు సహజ వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపు నిచ్చారు. కష్టకాలంలో దేశం కోసం బాధ్యతగా జీవించడం కూడా దేశభక్తేనని మోదీ అన్నారు.