తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్లో బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ జెండా ఎగిరిందని తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామన్నారు. ఈ సభకు పార్టీ శ్రేణలు భారీగా హాజరయ్యారు.