తెలంగాణలో యథావిధిగా ఇంటర్ ప్రవేశాలు
NEWS May 10,2026 02:08 pm
తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రవేశాలకు టైం తక్కువగా ఉండటం, విలీన ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందించిన తరువాత అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.