పవన్ కు ప్రధాని మోదీ పరామర్శ
NEWS May 09,2026 11:06 pm
హైదరాబాద్లోని మాదాపూర్ తన నివాసంలో అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పరామర్శించేందుకు ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఏపీ అభివృద్ధిపై ఇరువురు చర్చించే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన సమయంలోనే చిరంజీవి కూడా పవన్ నివాసానికి వచ్చి మోదీకి స్వాగతం పలకనున్నారు.