అక్రమ ప్రహరీ తొలగింపుకు హిందువుల కరసేవ
NEWS May 09,2026 10:50 pm
ఎమ్మిగనూరులోని కోతుల బావి ఆంజనేయస్వామి గుడి స్థలంలో నిర్మించిన అక్రమ ప్రహరీ తొలగింపుకు ఈ నెల 14న “శ్రీ హనుమ కరసేవ” నిర్వహిస్తున్నట్లు కార్యకర్త కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. భారీగా హిందువులు పాల్గొని క్రమశిక్షణతో కరసేవను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.