హామీలు మరిచిన కూటమి ప్రభుత్వం
NEWS May 09,2026 10:49 pm
ఎమ్మిగనూరు పట్టణంలోని 34వ వార్డు వేణు విద్యాలయం స్కూల్ లైన్, లక్ష్మీపేట ప్రాంతంలో నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని CPI నాయకులు విమర్శించారు. రోడ్డు దెబ్బతిన్న కారణంగా విద్యార్థులు, కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త రోడ్డు నిర్మించి ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.