మోదీ వచ్చాక 9 మంది బీజేపీ సీఎంలు
NEWS May 09,2026 04:46 pm
2014లో ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం విస్తరించింది. హరియాణా, మహారాష్ట్రలతో ప్రారంభమై అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, త్రిపుర, ఒడిశా, బిహార్ వరకు చేరింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పాలనకు చెక్ పెట్టి బీజేపీ ఘన విజయం సాధించింది. సువెందు అధికారి తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో మోదీ ప్రధానిగా వచ్చిన తర్వాత తొలిసారి బీజేపీ సీఎంలు ఏర్పడిన రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది.