చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ IPL చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. IPLలో బంతుల పరంగా అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సంజూ ఈ మైలురాయిని అందుకున్నాడు.