త్వరలో జరగబోయే పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి 3 నెలల సమయం పడుతుంది. దీంతో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో.. ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు AIFB రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఉమ్మడి గుర్తు కోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫారంతో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.