మరిచిన ఆస్తులను గుర్తు చేసిన మోదీ
NEWS Dec 10,2025 11:41 am
క్లెయిమ్ చేయని ఆస్తుల గురించి ప్రధాని మోదీ ‘లింక్డిన్’ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మరిచిపోయిన, క్లెయిమ్ చేయని నగదును దక్కించుకోవాలని ‘మీ డబ్బు.. మీ హక్కు’ అన్నారు. భారతీయ బ్యాంకుల్లో ₹78 వేల కోట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో ₹14 వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో ₹3వేల కోట్లు, డివిడెండ్లు ₹9వేల కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయని చెప్పారు. ఈ ఆస్తుల గురించి తెలుసుకునేందుకు సంబంధిత వెబ్సైట్లను షేర్ చేశారు.