ఫస్ట్ డే ₹1.88 లక్షల కోట్ల ఒప్పందాలు
NEWS Dec 08,2025 11:13 pm
HYD: తెలంగాణ ప్రభుత్వ రైజింగ్ గ్లోబల్ సమిట్లో తొలి రోజు భారీగా MOUలు కుదిరాయి. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ తదితర రంగాల్లో వివిధ కంపెనీలతో ₹1.88 లక్షల కోట్ల మేర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. డీప్ టెక్నాలజీ రంగంలో ₹75 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ రంగంలో ₹27 వేల కోట్లు, పునరుత్పాదక రంగంలో ₹39,700 కోట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ₹19,350 కోట్లు, ఏవియేషన్ రంగంలో జీఎంఆర్ గ్రూప్తో ₹15 వేల కోట్లు, తయారీ రంగంలో ₹13,500 కోట్లు, ఉక్కు రంగంలో ₹7 వేల కోట్లు, టెక్స్టైల్ రంగంలో ₹4 వేల కోట్లు మేర ఒప్పందాలు కుదిరాయి.