వికల్ప్ పేరుతో మావోయిస్టులు మరో సంచలన లేఖ విడుదల చేశారు. దేవ్జీ సహా మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. లొంగిపోవడానికి వాళ్లు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ పోలీసులకు చెప్పారన్నది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అతడి హత్యకు నలుగురు వ్యక్తులే కారణమని లేఖలో వెల్లడించారు. కోసాల్ అనే వ్యక్తి అతడి హత్యకు ప్రధాన కారణమని మావోయిస్టులు ఆరోపించారు.