ప్రభుత్వ ఇల్లు కోసం రేపటి వరకే ఛాన్
NEWS Nov 29,2025 01:38 pm
AP: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు PM ఆవాస్ యోజన (గ్రామీణ్)-NTR పథకాన్ని అమలు చేస్తున్నాయి. సొంత స్థలం ఉన్న వారికి ఆర్థికసాయం, లేని వారికి 3 సెంట్ల స్థలం+ఆర్థికసాయం అందిస్తున్నాయి. ఇందుకు సంబంధించి దరఖాస్తు గడువు రేపు నవంబర్ 30తో ముగుస్తుంది. అర్హులైన వారు గ్రామ/మున్సిపల్ వార్డు సచివాలయాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.