అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల
నిర్మాణాలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
NEWS Nov 28,2025 11:52 am
తుళ్లూరు: అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, నారాయణ హాజరయ్యారు. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.