జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతాం
NEWS Nov 28,2025 10:50 am
భద్రాచలం: జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. MMC (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖను విడుదల చేశారు. అందరం ఒకేసారి లొంగిపోతామని, మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందన్నారు. కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని, అందరూ లొంగిపోయే వరకు MMC రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని కోరారు.