నిరాశపరిచిన భారత సుందరి
NEWS Nov 21,2025 09:56 am
ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో భారత్కు నిరాశ ఎదురైంది. భారత సుందరి శ్రీ గంగానగర్ (రాజస్థాన్)కు చెందిన మానిక విశ్వకర్మ టాప్ 12లో స్థానంలోకి చేరలేదు. ముందుగా టాప్ 30 వరకు చేరుకుని ఆశలు రేపింది. ఫైనల్స్లో భాగంగా జరిగిన స్విమ్సూట్ రౌండ్లో మానిక ప్రదర్శన జడ్జీలను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కొలంబియా, క్యూబా, మెక్సికో, థాయ్లాండ్, ఫిలిప్పీన్స్, చైనా, వెనిజులా సహా 12 దేశాల సుందరీమణులు తర్వాతి రౌండ్ అయిన ఈవినింగ్ గౌన్ రౌండ్లో పోటీ పడుతున్నారు. త్వరలోనే మిస్ యూనివర్స్ 2025 విజేత ఎవరో తేలిపోనుంది.