19న పుట్టపర్తికి ప్రధాని మోదీ
NEWS Nov 17,2025 11:49 pm
AP: ఈ నెల 19న పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. భక్తులకు ఏర్పాట్లు, రవాణా సౌకర్యాల కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించింది. గోవిందరావు, గోపాలకృష్ణ, కళ్యాణ్ చక్రవర్తికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. అలాగే సమీప జిల్లాలకు చెందిన జేసీ, 9 మంది డిప్యూటీ కలెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.