అగ్రనేతలకు నవీన్ యాదవ్ పరిచయం
NEWS Nov 15,2025 10:23 pm
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి పరిచయం చేసినట్లు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నవీన్ యాదవ్ను రాహుల్ గాంధీ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసినట్లు రేవంత్ తెలిపారు. ఖర్గేను, రాహుల్ను కలిసిన సమయంలో నవీన్ యాదవ్తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.