10 జట్లతో విమెన్స్ వన్డే వరల్డ్ కప్–2029
NEWS Nov 08,2025 10:36 am
విమెన్స్ వన్డే వరల్డ్ కప్–2029ను 10 జట్లతో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 8 జట్ల ఫార్మాట్ను విస్తరించనుంది. ‘ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్కు భారీ ఆదరణ లభించింది. మరిన్ని దేశాలకు విస్తరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎడిషన్లో 10 జట్లకు అవకాశం కల్పిస్తాం. ఈ సారి మెగా కప్ పోటీలను 3 లక్షల మంది స్టేడియాల్లో వీక్షించారు. విమెన్స్ క్రికెట్లో ఇదో రికార్డు. ఆన్ స్క్రీన్ ప్రేక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇండియాలో 500 మిలియన్ల వ్యూయర్షిప్ నమోదైంది’ అని ఐసీసీ పేర్కొంది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, అమోల్ మజుందార్ను విమెన్స్ క్రికెట్ కమిటీలోకి తీసుకున్నారు.