'వందేమాతరం' ఉత్సవాలు ప్రారంభించిన మోదీ
NEWS Nov 07,2025 01:00 pm
భారత జాతీయ గీతం 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వందేమాతరం స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఈ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని అన్నారు.