వేగం తగ్గించాలి.. బస్సులు పెంచాలి
NEWS Nov 04,2025 01:33 pm
ఇటీవల ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వేగంగా నడుపుతున్నారని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో రాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని అంటున్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని, ఒత్తిడికి గురవుతున్నామని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. అంటే డ్రైవరన్నలు స్పీడ్ తగ్గించాలి. ప్రభుత్వం కొత్త బస్సులను పెంచాలి. రోడ్లు బాగు చేయాలి. ఈ ప్రధాన విషయాలను సరి చేస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందంటున్నారు.